Saturday, March 28, 2020

ఫల స ప్తమీ వ్రతము

ఫల స ప్తమీ వ్రతము


ఈశ్వరుడు బ్రహ్మకిట్లు చెప్పెను: ఫల స ప్తమియను స ప్తమి విషయము తెలిపెదను. ఈ నాడుపవసించినవాడు పాపముక్తుడై స్వర్గమందును.
మార్గశిర శుక్ల పంచమినాడు వ్రత నియమములు పాటించి గడపి షష్ఠినాడు ఉపవసించవలెను. (విశోక స ప్తమివలెనే) స ప్తమినాడు బంగారు పద్మమును శర్కరను బంగారుతో ఫలపు బొమ్మను కుటుంబియగు బ్రాహ్మణునకు రెండు పూటలందును ధర్మత త్త్వము నెరిగి 'భానుర్మే ప్రీయతాం' 'భానుడు నాయందు ప్రీతుడగుగాక!' అనుచు దానమీయవలెను. యథాశ క్తిగా విప్రులను పరమాన్నముతో భుజింపజేసి తానునట్లే భుజించి ఫలత్యాగము చేయవలెను. ఇట్లు కృష్ణపక్ష స ప్తమివరకు చేయుచు మరల ఆ కృష్ణ (మార్గశిర) స ప్తమినాడును ఉపవసించి హేమఫలమును సువర్ణపద్మమును శర్కరా పాత్రమున వస్త్ర మాల్యములను దానమీయవలెను. ఈ విధముగ సంవత్సరకాలము ఉభయ సప్తములందును (శుక్ల స ప్తమితో ఆరంభించి కృష్ణ స ప్తమివరకు) ఉపవాన పూర్వకముగా (రెండు స ప్తములందును దానములు-నడుమ దినములలో నియమమును పాటించుట) క్రమముగా సూర్య దేవతాక మంత్రముల పఠించుచు చేయుచుండవలెను. ఫలత్యాగము చేయునపుడు మార్గశిరము మొదలు కా ర్తికమువరకు ప్రతి మాసముంనందును వరునగా-భానుఃప్రీయతాం-ఇట్లే-అర్కః-రవిః-బ్రహ్మా-సూర్యః-శక్రః-హరిః-శివః-శ్రీమాన్‌-విభావసుఃత్వష్టా-అరుణః-అను నామములను 'ప్రీయతాం' అను పదముతో చేర్చి పలుకవలయును. ప్రతిపక్షమునను-స ప్తమినాడు ఇట్లు దానమును ఫలత్యాగమును చేయవలయును.
వ్రతాంతమునందు విప్ర దంపతులను వస్త్రభూషణములతో పూజించి శర్కరాపూర్ణ కలశమును సువర్ణఫల ప్రతిమను వారికి దానము ఈయవలెను. ''రవీ! భక్తుల కోరికల సఫలము చేయు నీ దయచేత నాకును జన్మజన్మమునందును అనంతఫలములు లభించుగాక!'' అని ప్రార్థించుచు దాన మీయవలయును.
అనంత ఫలప్రదయగు ఈ ఫల సప్తమీ వ్రతము చేసినవాడు సర్వపాపముక్తుడై పవిత్రతనొంది సూర్యలోకమున పూజితు డగును. వానికి సురాపానాది పాపము లేవైన ఎప్పటివైన ఉన్నను అవియు నశించును. అతని వెనుకముందు ఇరువదియొక తరముల వారును తరింతురు. దీనిని చదివిన-వినిన-వారికి కూడ ఈ ఫలము లభించును.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున ఫలసప్తమీ వ్రత కథనమను డెబ్బదియారవ అధ్యాయము

No comments:

Post a Comment

శ్రీసూర్య నవావరణ స్తోత్రం

 శ్రీసూర్య నవావరణ స్తోత్రం