Saturday, March 28, 2020

మందార సప్తమీ వ్రతము

మందార సప్తమీ వ్రతము


ఈశ్వరుడు బ్రహ్మతో ఇట్లు చెప్పెను: ఇక ఇప్పుడు సర్వపాపనాశకము సర్వకామప్రదము పుణ్యదము నగు మందార స ప్తమీ వ్రతమును తెలిపెదను. మాఘ శుక్ల పంచమినాడు లఘువుగా భుజించవలెను. షష్ఠినాడు స్నానాదికమును చేసికొని పగలంతయు ఉపవసించి రాత్రి మందార కుసుమమును ఆహారముగా తీసికొనవలెను. స ప్తమినాడు బ్రాహ్మణ భోజనము జరుపవలెను. ఆనాడు ఎనిమిది బంగరు మందార పుష్పములను-పద్మహస్తుడగు మనోహరుడగు పురుషుని బంగారు ప్రతిమను అష్టదళ సువర్ణ కమలమును రాగి పళ్లెరములో నూవులు పోసి వానిపై నుంచవలెను. పిమ్మట ఆ అష్టదళ పద్మమునందలి దళములలో తూరన్పునుండి ఈశాన్యము వరకు గల ప్రతియొక దళమును ఈ ఎనిమిది బంగారు మందారు కుసుమములతో వరుసగా- 1. భాస్కారయ నమః-ప్రాగ్దళం పూజయామి; 2. సూర్యాయ నమః-ఆగ్నేయ దళం పూజయామి; 3. అర్కాయ నమః-దక్షిణ దళం పూజయామి; 4. అర్యవ్ణ నమః-నైరృత దళం పూజయామి; 5. వేదధామ్నే నమః పవ్చిమ దళం పూజయామి; 6. చండభానవే నమః వాయవ్య దళం పూజయామి; 7. పూష్ణే నమః ఉత్తర దళం పూజయామి; 8. ఆనందాయ నమః ఈశాన్య దళం పూజయామి; అని పూజించవలెను. స్వర్ణ పురుష ప్రతిమను పద్మకర్ణికయందుంచి 'సర్వాత్మనే నమః' అని పూజించి నూతన శ్వేతవస్త్రము చుట్టి భక్ష్యమాల్య ఫలాదులతో అర్చించి అవి అన్ని యు వేదవే త్తయగు విప్రునకు దాన మీయవలయును. ఆ రాత్రి తైల లవణములు (కారము పులుపు) లేకుండ ప్రాఙ్ముఖుడై భుజించి మౌనము పాటించవలెను.
ధనమునకై లోభించక యథాశ క్తిగ ఇట్లు ప్రతిమాసము సంవత్సరకాలము చేయవలెను. వ్రతాంతమున ఈ సామగ్రులను కలశముతోను గోవుతోను కూడ విప్రునకు దానము ఈయవలెను. దీనిచే సకల సంపదలు కలుగును. ''మందారనాధుడు మందార కుసుమము భవనముగా కలవాడు నగు రవీ! మమ్ము సంసార సాగరమునుండి తరింపజేయుము'' అని ప్రార్థించుచు ఇట్లు మందార స ప్తమీ వ్రతము చేయు నరులు పాపముక్తులై స్వర్గమున ఇంద్రునితో కూడి ఆనందింతురు. పాపము లనెడు చీకటితో నిండిన సంసార మనెడు రాత్రియందు దీపము వంటి ఈ వ్రతమును ఆధారముగా తీసికొనినచో జారి పడదు. ఈప్సితార్థ ఫలప్రదమగు దీనిని వినినను చదివినను తెలిపినను అట్టివాడును పాపముక్తుడగును.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున మందార స ప్తమీ వ్రతమును డెబ్బది తొమ్మిదవ అధ్యాయము.

No comments:

Post a Comment

శ్రీసూర్య నవావరణ స్తోత్రం

 శ్రీసూర్య నవావరణ స్తోత్రం