Showing posts with label శ్రీ పద్మ మహా పురాణం. Show all posts
Showing posts with label శ్రీ పద్మ మహా పురాణం. Show all posts

Thursday, March 26, 2020

ఆదిత్యశయనవ్రతము

ఆదిత్యశయనవ్రతము


భీష్ముడనియె : ఉపవాస ఫలము కావలెనని కోరును జబ్బు మనిషి. అలాంటి వానికి హితమైన వ్రత మానతిమ్మన పులస్త్యుడనియె. ఉపవాసమునకు శక్తి లేనివానికి నక్త భోజనము (రాత్రి భోజనము) సమ్మతము. ఆదిత్యశయన వ్రత మందది యనుకూలము. ఆ వ్రతమునందు శంకరు నర్చన జరుగును. హస్త నక్షత్రము సప్తమి తిథి భానువారమును కలిసి వచ్చినప్పుడు సూర్య సంక్రాంతి కూడ యైనచో నది సర్వ కామ సమృద్ధి నిచ్చును. 

ఆనాడు చేయవలసినది ఆదిత్య శయన వ్రతము సూర్య నామములు సెప్పి ఉమామహేశ్వర పూజ సేయవలెను. శివలింగమును ఉమామహేశ్వరులనీ యిద్దరిని గలిసి పూజింపవలెను. కారణము యిద్దరికి భేదము లేకపోవుటయే.



హస్తేతు సూర్యాయ నమోస్తు పాదావర్కాయ చిత్రాసు చ గుల్ఫదేశం |
స్వాతీషు జంఘే పురుషోత్తమాయ ధాత్రే విశాఖాసు చ జానుదేశమ్‌ || 7
తథానురాధాసు నమోభిపూజ్యమూరుద్ద్వయం చైవ సహస్రభానోః |
జ్యేష్టాస్వనంగాయ నమోస్తు గుహ్యమింద్రాయ భీమాయ కటిం చ మూలే || 8
పూర్వోత్తరాషాడయుగే చ నాభిం త్వష్ట్రే నమః సప్తతురంగగమాయ |
తీక్షాంశ##వే శ్రవణ చాథ కుక్షీం పృష్టం ధనిష్టాసు వికీర్తనాయ || 9
వక్షఃస్థలం ధ్వాంతవినాశాయ జలాధిపర్షే ప్రతిపూజనీయం |
పూర్వోత్తరాభాద్రపదద్వయే చ బాహూత్తమశ్చండకరాయ పూజ్యై || 10
సామ్నామధీశాయ కరద్వయం చ సంపూజనీయం నృప రేవతీషు |
నఖాని పూజ్యాని తథాశ్వినీఘ నమోస్తు సప్తాశ్వధురంధరాయ || 11
కఠోరధామ్నే భరణీషు కంఠం దివాకరాయేత్యభిపూజనీయం |
గ్రీవాగ్నిపక్షేధరసంపుటే తు సంపూజయేద్భారత రోహిణీషు || 12

మృగేర్చనీయా రసనా పురారే రౌత్రే తు దంతాహరయే నమస్తే |
నమః సవిత్రే ఇతి శంకరస్య నాసాభిఫూజ్య చ పునర్వసౌ చ || 13
లలాటమంభోరుహవల్లభాయ పుష్యేలకాన్వేదశరీరధారిణ |
సార్పే చ మోలిం విబుధప్రియామ మఘాసు కర్ణావితి పూజనీ || 14
పూర్వాసు గోబ్రాహ్మణనందనాయ నేత్రాణి సంపూజ్యతమాని శంభోః | అథోత్తరాఫాల్గునిభే భ్రువౌ చ విశ్వేశ్వరాయేతి చ పూజనీయే || 15
నమోస్తు పాదాంకుశపద్మశూలకపాలసర్పేందుధనుర్థరాయ |
గయాసురానంగపురాంధకాదివినాశమూలాయ నమః శివాయ || 16

నూనె, మాంసము, కారము లేని యాహారము తినవలెను. భుక్తశేషము తినరాదు. రాజా! ఈలా నక్తములు చేసి పునర్వసు నక్షత్రమందు శాలి బియ్యమొక ప్రస్థము ఉదుంబర పాత్రమునందుంచి ఆవు నెయ్యితో బంగారము విప్రునకీయ వలెను. సప్తను పారణమందు వస్త్రముల చావు అధికముగ నీయవలెన. పదునాల్గవ పారణమందు బెల్లము, పాలు, నెయ్యి మొదలయిన వానితో బ్రాహ్మణునికి భోజనము పెట్టి బంగారు తామర పువ్వు ఎనిమిదంగుళాల విరిచినది పద్మరాగ మణులు దేవతలతో కర్ణికతో చేయించి సలక్షణమైన శయ్యను విరుద్ధగ్రంధి వర్జితాల తలగడతో, వితానముతో, పక్క దుప్పటితో, పాదుకలు, పాదరక్షలు, గొడుగు చామరము (వింజరామర), పీట (ఆసనము), అద్దము అలంకారములతో పండ్లు, వస్త్రములు, గంధములు దాని యందలంకరించి కపిల గోవును వస్త్రము కప్పి, వెండి డెక్కలతో, బంగారు తొడుగు కొమ్ములతో, దూడతో , కంచు పాలచెంబుతో మంత్ర పూర్వకముగా పూర్వాహ్ణము దాటకుండ దానమీయవలెను.

యథైవాదిత్య శయనమశూన్యం తవ సర్వదా | కాంత్యా ధృత్యా శ్రియా పుష్ట్యా తథా మే సంతు వృధ్దయః || 
యథా న దేవాః శ్రేయాంసం త్వదన్యమనఘం విదుః | తథా మాముద్దరా శేషదుఃఖసంసారసాగరాత్‌ || 
తతః ప్రక్షిణకృత్య ప్రణమ్య చ విసర్జయేత్‌ | శయ్యాం గవాది తత్సర్వం ద్విజస్య భవనం నయేత్‌ || 
దాన మిచ్చునపుడు పఠింపవలసిన మంత్రము భావము-
ఆదిత్యమూర్తీ భగవంతుడా ! నీశయనమెప్పుడూ అశూన్యమో (నిండుగానుండునో) కాంతిచే, ధైర్యముచే, సంపదచే పుష్టిచే నేలాంటి లోటు లేనిచో అలా నాకు సర్వ వృద్దులు గలుగు గాక ! అలా నన్ను సర్వ దుఃఖ సాగరము నుండి యుద్దరింపు అని పలికి ప్రదక్షిణము సేసి నమస్కరించి యా విప్రుని సాగనంపవలెను. శయ్య గోవు వంటి సత్కరించిన సామగ్రినంతయు నా ద్విజునింటికి జేర్చవలెను.

ఈ వ్రత మాచరించిన స్త్రీ పురుషుడు బంధుప్రీతి ధనాది సంపదల కెడవడడు. భార్యా పుత్రాదులతో నిరంతరానందభరితులగుదురు. మున్ను వశిష్ఠుడు, అర్జునుడు, ఇంద్రుడు, కుబేరుడు మున్నగు భాగ్యవంతులీ వ్రత మాచరించిరి. ఈ కథ పఠించినను నీ ఫలము సింద్దించును. విన్నను పాపములన్నియు పోయి ఫలములివి కల్గును. నరకము పాలైన పితరులను గూడ యిది యుద్దరించును.

రావి, మఱ్ఱి, మేడి, నందీశము , నేరేడు, మారేడు నను నీ ఆఱు వృక్షముల పుల్లలతో మార్గశిరము మొదలు రెండేసినెలకొక్క దానిచే దంత ధావనము సేయవలెను. పండ్రెండు మాసాలైనంత దధ్యన్నము, వితానము (చాందిని) జెండా చామరలతోనుదక కుంచములయందు రత్నాలతో దానము సేయవలెను. విత్తలోభము సేయకూడదు. దానిచే సర్వైశ్వర్య సంపన్ను లగుదురు.
ఇది శ్రీ పద్మ మహా పురాణం - ఆదిత్యశయన వ్రతమను యిరువది యైదవ అధ్యాయము.


శ్రీసూర్య నవావరణ స్తోత్రం

 శ్రీసూర్య నవావరణ స్తోత్రం