శర్కరాఫలస ప్తమీవ్రతమ్
ఈశ్వరుడు బ్రహ్మతో ఇంకను ఇట్లు చెప్పెను: ఇట్టిదే యగు శర్కరా స ప్తమీ వ్రతమును తెలిపెదను. అది కల్మషనాశకమును-అనంతాయురారోగ్యైశ్వర్యప్రదమును.
మాఘ శుక్ల స ప్తమినాడుదయమున తెల్లని నూవుల(పొడితో-నూనె)తో స్నానము చేసి తెల్లని వస్త్రమాల్యముల ధరించవలెను. ఆరుగు అలికి దానిపై కుంకుమతో పద్మమును దాని నడుమ కర్ణికను వేయవలెను. 'నమః సవిత్రే' అను మంత్రముతో దానిపై గంధపుష్పము లుంచవలెను. దాని నడుమ నీటి కలశముంచి దానిపై శర్కరాపాత్ర నుంచవలెను. బంగారు గుర్రపు ప్రతిమను దానియందుంచి తెల్లని వస్త్రములతో మాల్యములతో గంధములతో ప్రతిమ నలంకరించవలయును. రవి నీ మంత్రముతో పూజించవలెను. (అర్థము): ''దేవేశా! సర్వదేవమయుడవుగా నీవు వేదములందు పఠింపబడుచున్నావు. కనుక ఈ చరాచర జగ త్తంతయు నీవే.'' తరువాత పంచగవ్యము త్రావి (ఉపవాసముతో) ఆ అరుగునకు దగ్గరగా నేలపయి వయనించవలెను. సౌరసూ క్తములనో పురాణములనో పురాణములనో చదువుచు కాని వినుచు కాని ఆ పగలును రాత్రియు గడుపవలెను. అష్టమినాడు నిత్యానుష్ఠానము నెరవేర్చికొని అదియంతయు బ్రాహ్మణునకు దానము ఈయవలయును. తన శ క్తికొలదిగా బ్రాహ్మణులకు నేతితో శర్కరా పాయసముతో భోజనము పెట్టవలెను. తానును మౌనముతో నుండి తై ల లవణరహితముగా భుజించవలెను.
ఇట్లు ప్రతి మాసమునను సంవత్సరకాలము చేసి పిమ్మట శర్కరా పూర్ణకలశముతో సర్వోపస్కర (సర్వసామగ్రీ) సహితమగు మంచమును పడకను పాడియావును శక్తి యున్నచో గృహమును కూడ సర్వోపకరణములతో ఈయవలయును. వేయి-లేదా నూరు-లేదా ఒక నిష్కము (పూర్వపు ఒక బంగారు నాణము) తూకముతో బంగారు గుర్రములను (యథాశ క్తి) చేయించి విప్రులచే సౌరసూక్తపాఠము పురాణ పఠనము చేయించి వారి కిది దానమీయవలయును. ధనమునకు లోభించి లోపము చేయుట దోషకరము.
సూర్యు డమృతము త్రావునపుడు అతని నోటినుండి పడిన అమృతపు బొట్టులే వడ్లు పెసలు చెరకు ఐనవి. ఇక్షుసారము శర్కర; అది అందేచే ఈ మూటిలో గొప్పది. అమృత స్వరూపము అయినది. హవ్యకవ్యములందు అందుచే శర్కర రవికి ప్రీతికరము.
ఈ శర్కరా సప్తమీ వ్రతానుష్ఠానము అశ్వమేధయాగ ఫలమును ఇచ్చును. సర్వదుఃఖశాంతిని పుత్త్రసౌత్త్ర వృద్ధిని పరబ్రహ్మత్వమును కూడ కలిగించును. అట్టివా డొక కల్పము కాలము స్వర్గమందుండి పిదప ముక్తి నందును.
దీనిని చదివినను వినినను తలచినను ఉ త్తమ జ్ఞానవంతుడై స్వర్గలోకమున అప్సరః సమూహముచే పూజింపబడును.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున శర్కరా స ప్తమీ వ్రత కథనమను డెబ్బది యేడవ అధ్యాయము.

No comments:
Post a Comment