కమల సప్తమీ వ్రతమ్
ఈశ్వరుడు బ్రహ్మతో ఇట్లు చెప్పెను: ఇపు డిక ఇట్టిదే యగు కమల స ప్తమీ వ్రతమును తెలిపెదను. దానిని కీ ర్తించినంతనే ఆదిత్యుడు సంతసించును. వసంత (చైత్ర వైశాఖములలో నేదైన) శుక్ల స ప్తమినాడు తెల్లని ఆవల (పిండితో-నూనె)తో స్నానము చేసి నూవుల పళ్లెరమునందు నూతన వస్త్రయుగ్మమునుంచి దానిపై బంగారు కమలముంచి గంధపుష్పాదికముతో సమర్చించవలెను. కమలహస్తుడు-విశ్వధారి-దివాకరుడు-ప్రభాకరుడు (పగటిని-ప్రకాశమును కలిగించువాడు) అగు రవీ! నీకు వందనము. అని నమస్కరించవలెను. పిమ్మట వికాల(సంధ్యా)సమయమున విప్రుని వస్త్రమాల్య విబూషణములతో సంపూజించి ఈ సామగ్రితో సువర్ణ కమలమును ఉదకుంభమును శ క్తి యున్నచో సాలంకారముగ కపిలగోవును విధానానుసారము దాన మీయవలెను. స ప్తమినా డుపవసించి అష్టమినాడు యథాశ క్తిగ భుజింపజేసి తానును భుజింపవలెను. సప్తమినాడు మాత్రము తైలములేని ఉపాహారము తినవలెను.
ఇట్లు ప్రతిమాసమున ధనముండియు లోభి చక శుక్ల స ప్తమినాడు సంవత్సరము పొడవున చేయుచు పోవలయును. వ్రతాంతమున (ఉద్యాపనముగా) బంగారు కమలముతోపాటు సర్వోపస్కరములతో శయనము (మంచము పడకలు)బంగారు కొమ్ములు అలంకరించిన పాడి కపిల గోవును పాత్రలు పీఠములు ఆసనములు దీపములు మొదలగు ఇష్టసామగ్రిని కూడ ఈయవలెను.
ఇట్లు కమల స ప్తమీ వ్రత మాచరించినవాడు అనంతమగు లక్ష్మిని పొందుటయే కాక సూర్యలోకమున సుఖించును. కల్పమునకు ఒకటి చొప్పున ఏడు ఊర్ధ్వలోకములకు క్రమశః పోయి అచ్చట నెల్ల అప్సరసలతో పూజలందుకొని సుఖించి తుదకు ము క్తి నందును.
దీనిని సమగ్రముగా భక్తితో వినినను తెలిపినను ఇహమున స్థిరమగు ఐశ్వర్యము ననుభవించి పరమున విద్యాధర లోకమున సుఖించును.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున కమల స ప్తమీ వ్రతమను డెబ్బది ఎనిమిదవ అధ్యాయము.

No comments:
Post a Comment