Friday, March 27, 2020

శ్రీ ఆదిత్యవారనక్తవ్రతమ్‌

శ్రీ ఆదిత్యవారనక్తవ్రతమ్‌


మానవులకు ఆరోగ్య ప్రదమును అనంత ఫలప్రదమును శాంతి ప్రదమును నగు వ్రతమును తెలుపుమనిన నారదున కతడిట్లు వచించెను: విశ్వాత్మకమును సనాతనమునునగు పరబ్రహ్మ తత్త్వపు తేజము జగమున సూర్య చంద్రాగ్నులను మూడు రూపములతో ప్రకాశించుచున్నది. దాని నారాధించినవారు సదా క్షేమమునందుదురు. అందులకయి ఆదిత్య వారములందు నియతముగ పగలుపవసించి నక్తమున (రాత్రియందు) భుజించవలెను. ఎట్లన- ఆదిత్య వారముతో హస్త నక్షత్రము వచ్చినప్పుడు దానికి ముందటినాడు-శనివారమున పగటి మాత్రపు భోజనముతో ఏక భుక్తముచే విమత్సరుడై యుండి ఆదిత్యవారమునాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి తానును భుజించవలెను.
(దానికి ముందు) రక్తచందనముతో ద్వాదశ దళ పద్మము వ్రాసి దానియందు తూర్పున 'సూర్యాయనమః' ఆగ్నేయమున 'దివాకరాయనమః' దక్షిణమున 'వివస్వతేనమః' నైరృతమున 'భగాయనమః' పడమర 'వరుణాయనమః' వాయవ్యమున 'మహేంద్రాయనమః' ఉత్తరమున 'ఆదిత్యాయనమః' ఈశాన్యమన ' శాంతాయనమః' అని వ్రాయవలెను. అట్లే కర్ణికలో తూర్పున 'రవితురగేభ్యోనమః' దక్షిణమున 'యమాయనమః' పశ్చిమమున 'మార్తాండాయనమః' ఉత్తరమున 'రవయేనమః' కర్ణకనడుమ 'భాస్కరాయనమః' అని వ్రాయవలెను.

పిమ్మట ఆ పద్మమున నూవులును రక్తచందనమును కలిసిన రక్త పుష్పోదకముతో రవికి అర్ఝ్యమీయవలెను. (మంత్రార్థము): దివాకరానీవు కాలాత్ముడవు; సర్వభూతాత్ముడవు; వేదాత్ముడవు; సర్వతోముఖుడవు ; అగ్నీంద్రరూపుడవు; ఇట్టి నీకు తూర్పుదిశయందు నమస్కారము. 'అగ్నిమీళే' ఇత్యాది ఋక్కులతో నీకు నమస్కారము. 'ఇషేత్వోర్జేత్వా' ఇత్యాది మంత్రముతోను 'అగ్న ఆయాహి' ఇత్యాది మంత్రముతోను భాస్కరా! వరదా! జ్యోతిషాంపతీ! నీకునమస్సు. అనుచు రవి కర్ఝ్యము ఇచ్చి అతనికి ఉద్వాసనము చెప్పవలెను. ఆరాత్రి తైలము లేకుండ భుజించవలెను. ఇట్లు సంవత్సరము గడచిన తరువాత అనేక వ్రతములను దానములను ఆచరించినవాడు అంగవైకల్యము లేనివాడు జితేంద్రియుడు కుటుంబి పొగరులేనివాడు అగు బ్రాహ్మణుని ఎర్రనివికాని ఎరుపు పసుపు కలిసిన రంగువికాని అగు వస్త్రమాల్య ధూపములతో అర్చించి అతనికి యథాశక్తిగ బంగారుతో చేసిన పద్మమును ద్విభుజుడగు పురుషుని బంగారు కొమ్ములతో వెండిగిట్టలతో అపంలంకరించినదియు దూడ కలదియు పాలు పిదుకుటకు కంచుపాత్ర కలదియు అగు పాడి యావును దానమీయవలెను. (దానమంత్రము): ''పాపవినాశనుడు విశ్వాత్ముడు సప్తాశ్వుడు ఋగ్యజుస్సాను వేదములకు తేజస్సులకు నిధియు విధాతృడును సంసార సాగర నౌకయు జగత్పవిత్రుడునగు రవికి నమస్కారము.''
ఈ విధానమున సంవత్సరకాలమాచరించు మానవుడు పాపముక్తుడై సకల దేవతల తను సేవింప సూర్యపదమునందును. అతడు కర్మ నాశమును పొంది భూనాధుడై దుఃఖభయ రోగ రహితుడై ధర్మమూర్తియు అమితాయువునై ఊర్ద్వ సప్తలోకములను చేరి సుఖించును.
స్త్రీయైనను భర్తృ గురుదేవభక్తి కలిగి ఆదిత్యవార నక్తవ్రతమును ఇట్లాచరించినచో ఆమెయు దేవ గణ పూజితమగు ఉత్తమలోకమునందును . సందియము లేదు.
ఈ విధానమును వినినను చదివినను ఇతరులు చదువుట విని అనుమోదిం (ప్రశంసిం)చినను అట్టివాడును నూర్ల కోట్ల సంవత్సరములపాటు దేవపూజితుడై ఇంత్రభవనమున సుఖించును.
ఇది శ్రీమత్స్య మహాపురాణమున ఆదిత్యవార నక్త వ్రతమాహాత్య్మ కథనమను తొంబది ఆరవ అధ్యాయము.

సూర్యరథస్థ దేవతాభేద కథనము

సూర్యరథస్థ దేవతాభేద కథనము



సూర్యరథమును ఆయా మాసములందు యథాక్రమమున ఆయా దేవతదలు అధిష్ఠించియుందురు. అందుచేతనే రవి ఆయా మాసములందును ఆయా ఋతువులందును ఆయా ఋషులతో గంధర్వులతో అప్సరసలతో సర్వగ్రామణు (శ్రేష్ఠు)లతో రాక్షసులతో కూడి తన రథమును నడుపుకొనుచుపోవు చుండునని వేదశాస్త్రములందు చెప్పబడుచున్నది.
సూర్యరథమున 
1. వసంత ఋతువునందు-మధు-మాధవ-మానములు; ధాత-అర్యమన్‌-ఆదిత్య దేవతాభేదములు;పులస్త్యవులహులు-ఋషులు-వాసుకి కణాదులు నాగులు-నారద తుంబురులు గంధర్వులు-కృతస్థలాపుంజికస్థలలు అప్సరసలు-రథగృత్స రథౌజసులు గ్రామణులు-హేతిప్రహేతులు రాక్షసులు. 
2. గ్రీష్మర్చువునందు-శుచి-శుక్రమానములు; మిత్రుడు-వరుణుడు-ఆదిత్య దేవతాభేదములు-అత్రి వసిష్ఠులు ఋషులు-తక్షకరంభకులు నాగులు-హాహాహూహులు గంధర్వులు-మేనకాసహజన్యలు అప్సరసలు-రథంతర రథకృత్‌లు గ్రామణులు-పౌరుషయోధనులు రాక్షసులు; 
3. వర్షర్తువునందు-నభస్‌-నభస్య-మాసములు-ఇంద్ర-వివాస్వాన్‌-లు ఆదిత్య దేవతాభేదములు-అంగిరుడు భృగువు ఋషులు-ఏలాపుత్త్ర శంఖపాలులు నాగులు-విశ్వావసూగ్రసేనులు గంధర్వలు-ప్రవ్లూెచానువ్లూెచలు అప్సరసలు-హేతి-వ్యాఘ్రలు రాక్షసులు; 
4.శరదృతువునందు ఇషము ఊర్జము మాసములు-పర్జన్యుడు-పూషన్‌-ఆదిత్య దేవతాభేదములు-భారద్వాజుడు-గౌతముడు ఋషులు-ఐరావతుడు-ధనంజయుడు-నాగులు-చిత్రసేనుడు-సురుచి-గంధర్వులు-విశ్వాచీ-ఘృతాచీ-అప్సరసలు-సేనజిత్‌-సుషేణుడు-గ్రామణులు-పారుడు-అవారుడు రాక్షసులు; 
5. హేమంతమున సహస్‌-సహస్య-మాసములు-హంసుడు-భగుడు-ఆదిత్యదేవతాభేదములు-కశ్యపుడు-క్రతువు-ఋషులు-మహాపద్ముడు-కర్కటకుడు-నాగులు-చిత్రసేనుడు-ఘూర్ణాయువు-గంధర్వులు-పూర్వచిత్తి-ఊర్వశి-అప్సరసలు-తార్‌క్ష్యుడు-అరిష్టనేమి-గ్రామణులు-విద్యుత్‌-స్పర్శుడు-రాక్షసులు; 

6. శిశిర ఋతువునందు తపన్‌-తపస్య మాసములు-త్వష్ట-విష్ణువు ఆదిత్య దేవతాభేదములు-జమదగ్ని-కౌశికుడు-ఋషులు-కంబళుడు-అశ్వతరుడు-నాగులు-ధృతరాష్ట్రడు-సూర్యవర్చస్‌-గంధర్వులు-తిలోత్తమ-రంభ-అప్సరసలు-రుతజిత్‌-సత్యజిత్‌-గ్రామణులు-బ్రహ్మోపేతుడు-యక్షోపేతుడు-రాక్షసులు.

 శ్రీ మత్స్యమహాపురాణమున ఖగోళ వ్యవస్థయందు సూర్కది గ్రహరథాది స్వరూప శిశుమార స్వరూప ప్రతిపాదనను నూట ఇరువదియైదవ అధ్యాయము

Thursday, March 26, 2020

ఆదిత్యశయనవ్రతము

ఆదిత్యశయనవ్రతము


భీష్ముడనియె : ఉపవాస ఫలము కావలెనని కోరును జబ్బు మనిషి. అలాంటి వానికి హితమైన వ్రత మానతిమ్మన పులస్త్యుడనియె. ఉపవాసమునకు శక్తి లేనివానికి నక్త భోజనము (రాత్రి భోజనము) సమ్మతము. ఆదిత్యశయన వ్రత మందది యనుకూలము. ఆ వ్రతమునందు శంకరు నర్చన జరుగును. హస్త నక్షత్రము సప్తమి తిథి భానువారమును కలిసి వచ్చినప్పుడు సూర్య సంక్రాంతి కూడ యైనచో నది సర్వ కామ సమృద్ధి నిచ్చును. 

ఆనాడు చేయవలసినది ఆదిత్య శయన వ్రతము సూర్య నామములు సెప్పి ఉమామహేశ్వర పూజ సేయవలెను. శివలింగమును ఉమామహేశ్వరులనీ యిద్దరిని గలిసి పూజింపవలెను. కారణము యిద్దరికి భేదము లేకపోవుటయే.



హస్తేతు సూర్యాయ నమోస్తు పాదావర్కాయ చిత్రాసు చ గుల్ఫదేశం |
స్వాతీషు జంఘే పురుషోత్తమాయ ధాత్రే విశాఖాసు చ జానుదేశమ్‌ || 7
తథానురాధాసు నమోభిపూజ్యమూరుద్ద్వయం చైవ సహస్రభానోః |
జ్యేష్టాస్వనంగాయ నమోస్తు గుహ్యమింద్రాయ భీమాయ కటిం చ మూలే || 8
పూర్వోత్తరాషాడయుగే చ నాభిం త్వష్ట్రే నమః సప్తతురంగగమాయ |
తీక్షాంశ##వే శ్రవణ చాథ కుక్షీం పృష్టం ధనిష్టాసు వికీర్తనాయ || 9
వక్షఃస్థలం ధ్వాంతవినాశాయ జలాధిపర్షే ప్రతిపూజనీయం |
పూర్వోత్తరాభాద్రపదద్వయే చ బాహూత్తమశ్చండకరాయ పూజ్యై || 10
సామ్నామధీశాయ కరద్వయం చ సంపూజనీయం నృప రేవతీషు |
నఖాని పూజ్యాని తథాశ్వినీఘ నమోస్తు సప్తాశ్వధురంధరాయ || 11
కఠోరధామ్నే భరణీషు కంఠం దివాకరాయేత్యభిపూజనీయం |
గ్రీవాగ్నిపక్షేధరసంపుటే తు సంపూజయేద్భారత రోహిణీషు || 12

మృగేర్చనీయా రసనా పురారే రౌత్రే తు దంతాహరయే నమస్తే |
నమః సవిత్రే ఇతి శంకరస్య నాసాభిఫూజ్య చ పునర్వసౌ చ || 13
లలాటమంభోరుహవల్లభాయ పుష్యేలకాన్వేదశరీరధారిణ |
సార్పే చ మోలిం విబుధప్రియామ మఘాసు కర్ణావితి పూజనీ || 14
పూర్వాసు గోబ్రాహ్మణనందనాయ నేత్రాణి సంపూజ్యతమాని శంభోః | అథోత్తరాఫాల్గునిభే భ్రువౌ చ విశ్వేశ్వరాయేతి చ పూజనీయే || 15
నమోస్తు పాదాంకుశపద్మశూలకపాలసర్పేందుధనుర్థరాయ |
గయాసురానంగపురాంధకాదివినాశమూలాయ నమః శివాయ || 16

నూనె, మాంసము, కారము లేని యాహారము తినవలెను. భుక్తశేషము తినరాదు. రాజా! ఈలా నక్తములు చేసి పునర్వసు నక్షత్రమందు శాలి బియ్యమొక ప్రస్థము ఉదుంబర పాత్రమునందుంచి ఆవు నెయ్యితో బంగారము విప్రునకీయ వలెను. సప్తను పారణమందు వస్త్రముల చావు అధికముగ నీయవలెన. పదునాల్గవ పారణమందు బెల్లము, పాలు, నెయ్యి మొదలయిన వానితో బ్రాహ్మణునికి భోజనము పెట్టి బంగారు తామర పువ్వు ఎనిమిదంగుళాల విరిచినది పద్మరాగ మణులు దేవతలతో కర్ణికతో చేయించి సలక్షణమైన శయ్యను విరుద్ధగ్రంధి వర్జితాల తలగడతో, వితానముతో, పక్క దుప్పటితో, పాదుకలు, పాదరక్షలు, గొడుగు చామరము (వింజరామర), పీట (ఆసనము), అద్దము అలంకారములతో పండ్లు, వస్త్రములు, గంధములు దాని యందలంకరించి కపిల గోవును వస్త్రము కప్పి, వెండి డెక్కలతో, బంగారు తొడుగు కొమ్ములతో, దూడతో , కంచు పాలచెంబుతో మంత్ర పూర్వకముగా పూర్వాహ్ణము దాటకుండ దానమీయవలెను.

యథైవాదిత్య శయనమశూన్యం తవ సర్వదా | కాంత్యా ధృత్యా శ్రియా పుష్ట్యా తథా మే సంతు వృధ్దయః || 
యథా న దేవాః శ్రేయాంసం త్వదన్యమనఘం విదుః | తథా మాముద్దరా శేషదుఃఖసంసారసాగరాత్‌ || 
తతః ప్రక్షిణకృత్య ప్రణమ్య చ విసర్జయేత్‌ | శయ్యాం గవాది తత్సర్వం ద్విజస్య భవనం నయేత్‌ || 
దాన మిచ్చునపుడు పఠింపవలసిన మంత్రము భావము-
ఆదిత్యమూర్తీ భగవంతుడా ! నీశయనమెప్పుడూ అశూన్యమో (నిండుగానుండునో) కాంతిచే, ధైర్యముచే, సంపదచే పుష్టిచే నేలాంటి లోటు లేనిచో అలా నాకు సర్వ వృద్దులు గలుగు గాక ! అలా నన్ను సర్వ దుఃఖ సాగరము నుండి యుద్దరింపు అని పలికి ప్రదక్షిణము సేసి నమస్కరించి యా విప్రుని సాగనంపవలెను. శయ్య గోవు వంటి సత్కరించిన సామగ్రినంతయు నా ద్విజునింటికి జేర్చవలెను.

ఈ వ్రత మాచరించిన స్త్రీ పురుషుడు బంధుప్రీతి ధనాది సంపదల కెడవడడు. భార్యా పుత్రాదులతో నిరంతరానందభరితులగుదురు. మున్ను వశిష్ఠుడు, అర్జునుడు, ఇంద్రుడు, కుబేరుడు మున్నగు భాగ్యవంతులీ వ్రత మాచరించిరి. ఈ కథ పఠించినను నీ ఫలము సింద్దించును. విన్నను పాపములన్నియు పోయి ఫలములివి కల్గును. నరకము పాలైన పితరులను గూడ యిది యుద్దరించును.

రావి, మఱ్ఱి, మేడి, నందీశము , నేరేడు, మారేడు నను నీ ఆఱు వృక్షముల పుల్లలతో మార్గశిరము మొదలు రెండేసినెలకొక్క దానిచే దంత ధావనము సేయవలెను. పండ్రెండు మాసాలైనంత దధ్యన్నము, వితానము (చాందిని) జెండా చామరలతోనుదక కుంచములయందు రత్నాలతో దానము సేయవలెను. విత్తలోభము సేయకూడదు. దానిచే సర్వైశ్వర్య సంపన్ను లగుదురు.
ఇది శ్రీ పద్మ మహా పురాణం - ఆదిత్యశయన వ్రతమను యిరువది యైదవ అధ్యాయము.


ఆరోగ్య వ్రతము - శ్రీ సూర్యారాధన

ఆరోగ్య వ్రతము - శ్రీ సూర్యారాధన

అగస్త్యు డిట్లు చెప్పెను: మిక్కిలి పుణ్యమైనది, పాపములన్నింటిని పటాపంచలు చేయునది అగు ఆరోగ్య వ్రతమను పేరుగల వ్రతమును తెలియజేసెదను. మాఘమాసము శుక్లపక్ష సప్తమినాడు ఉపవాసముండి విష్ణు రూపుడు, సనాతనుడు నగు భాస్కరదేవుని పూజింపవలయును.
ఆదిత్య భాస్కర రవే భానో సూర్య దివాకర,
ప్రభాకరేతి సంపూజ్య ఏవం సంపూజ్యతే రవిః. 3

ఆదిత్యా! భాస్కరా! రవీ! భానూ! సూర్యా! దివాకరా! ప్రభాకరా! అనుచు పూజింపవలయును. షష్ఠినాడు ఆహారము తీసికొని సప్తమినాడు భానుని పూజింప వలయును. అష్టమినాడు మరల భొజనము చేయవలయును. ఇది యిందలి విధిక్రమము. ఈ విధితో ఒకనిండు సంవత్సరము సూర్యునర్చించు వానికి ఈ జన్మమున ఆరోగ్యము, ధనము, ధాన్యము లభించును. పరమున, మరల తిరిగి రాని శుభ స్థానము (మోక్షము) కలుగును.
మునుపు అసరణ్యుడను గొప్పబలము గల రాజు ఈ వ్రతముతో భాస్కరుని అర్చించెను. అతనియెడ తుష్టుడై ఆ దేవుడు ఉత్తమమగు ఆరోగ్యమును ప్రాసాదించెను.

ఇది శ్రీవరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున అరువది రెండవ అధ్యాయము.

దేవతలు చేసిన శ్రీ సూర్య స్తవం (సూర్యాఖ్యానం)- శ్రీ వరాహ పురాణం

దేవతలు చేసిన శ్రీ సూర్య స్తవం (సూర్యాఖ్యానం)- శ్రీ వరాహ పురాణం




మహాతపా ఉవాచ - 
యోసా వాత్మా జ్ఞానశక్తి రేక ఏవ సనాతనః,
స ద్వితీయం యదా చైచ్ఛత్‌ తదా స్మాత్మ స్థితోజ్వలత్‌. 2
మహాతపు డిట్లు చెప్పెను. - జ్ఞానమనుశక్తి గల సనాతనమగు ఆత్మ ఒక్కటియే మొదట ఉండెడిది. అది రెండవ దానిని కోరునప్పటికి తనలో నున్న వెలుగు వెలువడియెను.
యః సూర్య ఇతి భాస్వాంస్తు అన్యోన్యేన మహాత్మనః,
లీలాభూతాని తేజాంసి భాసయన్తి జగత్త్రయమ్‌. 3
అదియే గొప్ప వెలుగు గల సూర్యుడు. ఆతని వెలుగులు ఒక దానితో నొకటి బాగుగా కలిసిపోయి ఈ మూడు లోకములను ప్రకాశింప జేయుచున్నవి.
తస్మిన్‌ సర్వే సురాః సిద్ధా గణాః సర్వే మహర్షిభిః,
సమం సూతా ఇతి విభో తస్మాత్‌ సూర్యోభవత్‌ స్తుతః. 4
ఆతనియందు ఒక్కమారుగా సురలు, సిద్ధులు, అన్ని విధములైన దేవగణములు, మహర్షులతోపాటు పుట్టిరి. అందువలననే ఆతడు 'సూర్యు' డాయెను (సూర్యుడనగా పుట్టుటకు కారణమైవాడు)
లోలీభూతస్య తస్యాశు తేజసోభూ చ్ఛరీరకమ్‌,
పృథక్త్వేన రవిః సోథ కీర్త్యతే వేదవాదిభిః. 5
బాగుగా కాదలాడిన ఆతని తేజస్సునుండి వేరుగా ఒక శరీర మేర్పడెను. వేదవాదులు ఆ శరీరముగలవానిని రవి యని కీర్తించిరి.
భాసయన్‌ సర్వలోకాంస్తు యతోసా వుత్థితో దివి,
అతోసౌ భాస్కరః ప్రోక్తః ప్రకర్షాచ్చ ప్రభాకరః. 6
ఆతడు ఆకాశమున ఉదయించుచు లోకము లన్నింటిని ప్రకాశింపజేసెను. కావున ఆతనికి భాస్కరుడనుపేరు కలిగెను. ఆ ప్రకాశమే అధికమగుటవలన ప్రభాకరుడనియు నందురు.
దివా దివస ఇత్యుక్త స్తత్కారిత్వా ద్దివాకరః,
సర్వస్య జగత స్త్వాది రాదిత్య స్తేన ఉచ్యతే. 7
పగటిని దివసమందురు. దానిని చేయువాడు కనుక దివాకరుడు. జగమున కంతటికిని మొదటి వాడు కావున ఆదిత్యుడను పేరేర్పడెను.
ఏతస్య ద్వాదశాదిత్యాః సంభూతా స్తేజసా పృథక్‌,
ప్రధాన ఏవ సర్వేషాం సర్వదా స విబుధ్యతే. 8
ఈతని తేజస్సు చేతనే పండ్రెండుగురు ఆదిత్యులు విడిగా పుట్టిరి. ఆ అందరకు ప్రధానునిగా ఎల్లవేళల ఈతనినే చెప్పుదురు.
తం దృష్ట్వా జగతో వ్యాప్తిం కుర్వాణం పరమేశ్వరమ్‌,
తసై#్యవాన్తః స్థితా దేవా వినిష్క్రమ్య స్తుతిం జగుః. 9
జగము నంతటిని వ్యాపించుచున్న ఆ పరమేశ్వరుని గాంచి ఆతనిలోనే యున్న దేవతలందరు వెలుపలికివచ్చి యిట్లు స్తుతించిరి.
దేవా ఊచుః - దేవత లిట్లు పలికిరి.
భవాన్‌ ప్రసూతి ర్జగతః పురాణః
ప్రయాసి విశ్వం ప్రలయే చ హంసి,
సముత్థితో నాథ శమం ప్రయాహి
మా దేవ లోకాన్‌ ప్లుష కర్మసాక్షిన్‌. 10
దేవా!ఈ సమస్త జగత్తునకు నీవే కారణమవు. విశ్వమంతట తిరుగుచు ప్రళయమున నాశనము చేయుచున్నావు. ప్రభూ! శాంతింపుము. కర్మసాక్షీ! దేవ లోకములను మాడ్చి వేయకుము.
త్వయా తతం సర్వత ఏవ తేజః
ప్రతాపినా సూర్య యజుఃప్రవృత్తే,
తిగ్మం రథాఙ్గం తవ దేవకల్పం
కాలాన్త మధ్వాన్తకరం వదన్తి. 11
లోకములన్నింటిని తపింపజేయు తేజమును, యజ్ఞముల ప్రవృత్తికొరకు నీవు వ్యాప్తి చేయుచున్నావు. తీక్షణము దివ్యము నైన నీ చక్రమును కాలమనుపేరుతో వ్యవహరింతురు. అది చీకట్లను పారద్రోలును.
ప్రభాకర స్త్వం రవి రాదిదేవ
ఆత్మా సమస్తస్య చరాచరస్య,
పితామహ స్త్వం వరుణో యమశ్చ
భూతం భవిష్యచ్ఛ వదన్తి సిద్ధాః.
నీవు ప్రభాకరుడవు, రవివి. ఆదిదేవుడవు. ఈ చరాచరమైన సమస్తమునకు ఆత్మవు. తాతవు. వరుణుడు, యముడు నీవే గడచినది గడుపనున్నదియు నీవే అని సిద్ధులు పల్కుదురు.
ధ్వాన్తం ప్రణుత్వం సురలోక పూజ్య
ప్రయాహి శాన్తం పితరో వదన్తి,
వేదాన్త వేద్యోసి మఖేషు దేవ
త్వం హూయసే విష్ణు రసి ప్రసహ్య. 12
సురలోకము పూజలందుకొను దేవా! నీవు చీకట్లను చీల్చివేయుము. శాంతింపుము. పితృదేవతలు నిన్ను కొనియాడుదురు. నీవు వేదాంతముచేత తెలియదగినవాడవు. యజ్ఞములలో నిన్నే అర్చింతురు. నీవు విష్ణుడవు.
ఇతిస్తుత సై#్తః సురనాథ భక్త్యా,
ప్రసాహి శంభో న ఇతి ప్రసహ్య, 13
ఓ సురనాథా! శంభూ, మమ్ము చక్కగా పాలింపుము అని వారు భక్తితో స్తుతించిరి.
ఏవముక్త స్తదా దేవైః సౌమ్యాం మూర్తి మథాకరోత్‌,
ప్రకాశత్వం జగామాశు దేవతానాం మహాప్రభుః. 14
ఇట్లు దేవతలు స్తుతింపగా ఆతడు సౌమ్యమైన రూపమును దాల్చెను. గొప్పకాంతిగలవాడై వెనువెంటనే దేవతలకు గానవచ్చెను.
ఏతత్‌ సర్వం సురాణాం తు దహనం శామితం పురా,
సప్తమ్యాం ఖలు సర్యేణ మూర్తిత్త్వం కృతవాన్‌ భువి. 15
దేవతలకు తాపము కలిగించుట, మరల చల్లబడుట అను నిదియంతయు సప్తమినాడు జరిగెను. సూర్యు డాదినముననే భూమండలముపై ఆకృతిని పొందెను.
ఏతాం యః పురుషో భక్త్యా ఉపాస్తే సూర్యమర్చయేత్‌,
భాస్కరేణ చ తస్యా సౌ ఫలమిష్టం ప్రయచ్ఛతి. 16
ఈ తిథిని, సూర్యుని భక్తితో ఉపాసించు పురుషునకు భాస్కరుడు ఇష్టఫలము ననుగ్రహించును.
ఏతత్‌ తే కథితం రాజన్‌ సూర్యాఖ్యానం పురాతనమ్‌,
ఆదిమన్వన్తరే వృత్తం మాతరః శృణు సాంప్రతమ్‌. 17
రాజా! ప్రాతకాలపునాటి సూర్యునికథను నీకు వివరించితిని. మొదటి మన్వంతరమున నిది జరిగెను. 

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున ఇరువది యారవ అధ్యాయము.

సప్తమీవ్రతవర్ణన

సప్తమీవ్రతవర్ణన


అగ్ని రువాచ :
సప్తమీ వ్రతకం వక్ష్యే సర్వేషాం భుక్తిముక్తిదమ్‌ | మాఘమాసేబ్జకే శుక్లే సూర్యం ప్రార్చ్య విశోకభాక్‌.
సర్వావాప్తిస్తు సప్తమ్యాం మాసి భాద్రేర్కపూజనాత్‌ |
పౌషే మాసి సితే నశ్నన్ప్రార్చ్యార్కం పాపనాశనమ్‌. 2
కృష్ణపక్షే తు మాఘస్య సర్వావాప్తిస్తు సప్తమీ | ఫాల్గునే తు సితే నన్దాసప్తమీ చార్కపూజనాత్‌. 3
మార్గశీర్షే సితే ప్రార్చ్య సప్తమీ చాపరాజితా | మార్గశీర్షే సితే చాబ్దం పుత్రీయా సప్తమీ స్త్రియాః. 4
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే సప్తమీవ్రతాని నామ ద్వ్యశీత్యధిక శతతమో೭ ధ్యాయః.
అగ్నిదేవుడు చెప్పెను : అందరికిని భుక్తిముక్తిప్రద మగు సప్తమీ వ్రతమును చెప్పెదను. 
మాఘశుక్ల సప్తమీతిథియందు కమలమును నిర్మించి దానిపై సూర్యుని పూజించినవాడు శోకరహితు డగును. 
భాద్రపదశుక్ల సప్తమి యందు సూర్యుని పూజించినచో సకలాభీష్టవస్తువులు లభించును. 
పౌషశుక్లసప్తమియందు ఉపవాసము చేసి సూర్యుని ఆరాధించినచో సకలపాపములును నశించును. 
మాఘకృష్ణసప్తమినాడు 'సర్వాప్తిసప్తమీ' వ్రతము చేసినచో అభీష్ట-వస్తువులు లభించును. 
ఫాల్గునకృష్ణపక్షమునందు నందసప్తమీవ్రతమును చేయవలెను. 
మార్గశీర్షశుక్లపక్షమున పుత్రీయసప్తమీ వ్రతము ఒక సంవత్సరము పాటు చేయు స్త్రీలకు పుత్రులు కలుగుదురు.
అగ్నిమహాపురాణమునందు సప్తమీవ్రతవర్ణన మను నూటఎనుబదిరెండవ అధ్యాయము

Wednesday, March 25, 2020

శ్రీ ఆదిత్యోత్పత్తి వర్ణనమ్‌

శ్రీ ఆదిత్యోత్పత్తి వర్ణనమ్‌



కశ్యవునికి దక్షసుతయందు వివస్వంతుడుదయించెను. అతని భార్య సంజ్ఞ. ఆమె త్వష్టృ ప్రజాపతి కుమార్తె. నురేశ్వరియను పేర త్రిలోక ప్రఖ్యాతి నందినది. రూపవనశాలినియైన యా దేవికి భగవంతుడగు వివస్వంతుని యొక్క (మార్తాండుని యొక్క) యంద మంత యానందమీయదయ్యొను. ఆమె మంచి తపస్సుచేసి మంచి దీప్తి గడించుకొన్నది. కాని యాదిత్య మండలము వేడిమి కామె తనూలత వాడిపోయి యంతగ రాణింపదయ్యెను. కశ్యపుడు వాత్సల్యాతిశయముచే వీడు "అండమందు మృతుడు కాలేదు'' గత అని యొఱుంగక పలికిన కతన నాతనికి మార్తండుడను పేరు రుఢమయ్యెను. ఆతని తేజస్సు దుర్భరమై మల్లోకములను దహింపజేయునదయ్యెను. 

ఆదిత్యుడు (వివస్వంతుడు) సంజ్ఞాదేవియందు మనువును శ్రాద్ధదేవుడైన యమునింగనెను. యమున యను కన్యనుగూడ గాంచెను. యముడును యమునయు కవలపిల్లలు. సంజ్ఞ శ్యామవర్ణుడైన యా వివస్వంతుని జూచి యోర్వక తనకు సాటియైన ఛాయను (నీడను) మాయామయియైనదానిని కల్పించెను. ఆమె యెదుట నిల్చి ప్రాంజలియై మ్రొక్కి ఓ సుహాసిని! నా చేయనగు కార్యముం జెప్పుము. నీయాజ్ఞావశనైయున్నాను నన్నుంబనిగొమ్మనియొ.


సంజ్ఞ పలికెను... అబలా ! నేను పుట్టినింటి కేగెదను. నీకు భద్రమగునుగాక ! నాయింట నీవు నిశ్శంకముగ నుండవచ్చును. ఈ పిల్లలిద్దరు నీ బాలిక నా సంతానము. వీరిం గనిపెట్టుకొని యుండుము. ఈమాట భగవంతుడు వివస్వంతుని కెన్నడేని జెప్పకుము.
ఆనసవర్ణ - జుట్టుపట్టిలాగునందాక. శాపమిచ్చునందాక ఈ వార్త నేనెన్నడును జెప్పను. నీకు నమస్కారము. దేవీ! సుఖముగ వెళ్ళిరమ్మనెను.
తపస్వినియైన సంజ్ఞ సవర్ణకు (ఛాయకు) ఇట్లు తెలిపి బిడ్డలనప్పగించి తండ్రియగు త్వష్టప్రజాపతిసమీపమున కేగి సిగ్గున తలవంచుకొని నిలువబడెను. ప్రజాపతిచే భర్తసన్నిధికి పోపొమ్మని పలుమారులు అదలించిబెదిరించి యాదేశింపబడియు నయ్యింతి కాంతుని వంక బోక బడబాకృతిందాల్చి (ఆడుగుఱ్ఱమై) తనరూపము మఱుగుపఱచుకొని ఉత్తకురుభూములందు బచ్చికబయళ్ళలో తిఱుగజొచ్చెను.
రెండవ సంజ్ఞను ఈమె సంజ్ఞయేయని భావించి యామెయందా దిత్యుడు తన కీడైన కొడుకుంగాంచెను. ఇంతమున్ను, పుట్టిన మనుపును బోలినవాడైనందున నితడును''సావర్ణ మనువు'' అని పిలువబడుచుండెను.

అమెకు కల్గిన రెండవకుమారుడు శనైశ్చరుడు. అతడు పుట్టిన తరువాత నామె తనకప్పగించిన సవతిబిడ్డల నాదరింపదయ్యెను. మనువు దానికి సైచి యూరకుండెను. యముడది యోర్వక యాసవతి తల్లిని పాదమెత్తిబెదరించెను. అందులకు ఛాయ కోపించి మిగుల దుఃఖించి నీకాలు పడిపోవుగాక యని శపించెను. యము డావృత్తాంమును దండ్రికి ప్రాంజలియై విన్నవించెను. నా కామె యిచ్చిన శాపమును మరలింపుమని తండ్రిని వేడుకొనెను. తల్లి తనయులందరియెడ వాత్సల్యముతో వర్తింపవలయును గదా. ఈ యమ్మమమ్ములను నిరసించి బ్రతుకనెంచినది. అందువలన నే నామెపై పాదమెత్తితిని, ఎత్తితినే కాని యామె శరీరము తాకింపలేదు. బాల్యముచే లౌల్యముచే నెఱుంగక యేనొనరించిన తప్పును క్షమింపదగుదువు. తల్లి శాపమునకు గురియైతిని గ్రహరాజ! నీయను గ్రహముచే నాపాదము పడిపోకుండుగాక ! అని కొడుకు వాపోవ గరుణించి సూర్యుడిట్లనియె. పుత్ర! ఇందేదో గొప్పకారణముండి తీరును, ధర్మజ్ఞుడవు, సత్యవచనుడవైన నిన్ను క్రోధమావేశించినది. నీ తల్లిమాట మిధ్య గాకుండుటకు కృములు నీకాలిమాంసముcదిని యవని కేగును. ఈరీతి మీయమ్మమాట సత్యము కాగలదు. ఈ విధమైన శాపపరిహారముచే నీవును సురక్షితుడయ్యెద వనెను.
ఆదిత్యుడు సంజ్ఞం జూచి (ఛాయామూర్తిని) బిడ్డలనందర నొక్కరీతిగా గాక యొక్కనియందెక్కువ ప్రేమ నీకెందుల కనియడిగిన నామె యామాట దప్పించెనేగాని నిజము సెప్పదయ్యె. అతడు తనకుదా సమాధానపడి యోగ దృష్టిచే నిజమెఱింగెను. ఆమె నప్పుడు శపింపబూనియు శాపమీయక జుట్టు పట్టుకొని యూచెను. అంతనామె జరిగినదెల్ల పతికి విన్నవించెను. వివన్వంతుడువిని కవలి మామగారగు త్వష్ట చెంత కరిగెను. మామయు నటువచ్చిన యల్లు నాదరించెను. రోషముగొని తనను దహింప నేతెంచినాడని గ్రహించియపు డాతని ననునయించుచు నిట్లనియె.
ఓ అదిత్యమూర్తి ! నీరూపమిది భరింపరాని తేజముచే జూడరాదయ్యె. సంజ్ఞ యిదిసైపనేరక పచ్చిక బయళ్ళ తిరుగాడు చున్నది. శుభచారిణయైన నీ సహధర్మచారిణి నిప్పుడు చూడవలయును. అమె శ్లాఘనీయ యోగబల సంపన్నురాలు. గ్రహఠాజగు నీకు నామాట యనుకూలము సమ్మతమగు నేని యోగమూని యామె చెంత కరుగును. నీరూపమును జూడముచ్చటగ నొనరింతునని తెలిపి యాతరణిని (సూర్యుని) యంత్రమునెక్కించి చెక్కివైచెను. తరణిని యంత్రమున బట్టిన నాటినుండీ తరణిబట్టుటన నీపేరు లోకమున రూఢికెక్కెను. దాన నాతనితేజస్సు కొంతడిందువడి రూపము చూడ నందమయి యింపొందెను. ఆ మీద నతడు యోగశక్తిచే నేగి తన భార్యను బడరూపమున జరించు దానినిం జూచెను. తేజస్సుచే పాతివ్రత్య నియమముచే భూతములక దృశ్యయైయున్న యయ్యంగనను ఎందును జడియక సంచరించుచున్నంగని తాను నశ్వరూపముc దాల్చి ముఖమునం గవయబోయెను. పరపురుషశంకగొని యామె పెడమెగయయిమున్నతఱి నామెయందు నిక్షిప్తమైన శుక్రమామె నాసికారంద్రముల వెంట చీదివైచెను. అందుండి అశ్వినులు అను దేవవైద్యులు నాసత్యుడు(దన్రులు) అని పేర్కొనబడెడువా రిద్దరుదయించిరి. అష్టమ ప్రజాపతియగు మార్తండుని ¸°రను లీయిర్వురు మిక్కిలి యందగాండ్రు. భాస్కరుడు నవ్వల నాకాంతకు మిగులకాంతుడై కానవచ్చె. అమె కూడ తన మనోహరునింగని మిగుల సంతోషించెను.
యముడు మాత్రము తా మున్నొనరించినపనికి మిక్కిలి పగచెంది ప్రజలను ధర్మముచే రంజింపజేసి ధర్మరా జనుసార్ధక నామముం బితృదేవతల కాధిపత్యమును లోక పాలకత్వముం బడసెను. సావర్ణి ప్రజాపతి సావర్ణి మన్వంతరమున మనువు కాగలడు. అతడు మేరుగిరిపై నిప్పుడును తపము చేయుచున్నాడు. వాని తమ్ముడు శని గ్రహపదవినందెను. త్వష్ట (సూర్యబింబమును) తరణి బట్టగా రాలిన రజమునుబ్రోవు చేసి విష్ణుచక్రమునుగావించె. అది దానవాంతకము అప్రతిహతము. యముని తరువాత బుట్టిన యా బాలిక యమునయనుపేర లోకపావనియైన నది యయ్యెను. మనువు సావర్ణుడుననుపేర నా రెండవ కుమారుడు పిలువబడెను. ఆయన తమ్ముడు శని గ్రహపదవినంది సర్వలోకపూజితుడయ్యెను. దేవతల యీజన్మ వృత్తాంతమును విన్న యాతడు ఆపదలను బాసి యహాయశస్సునందును.

బ్రహ్మపురాణము -అదిత్యోత్పత్తి కథనం నామ షష్టోధ్యాయః నుండి.

శ్రీసూర్య నవావరణ స్తోత్రం

 శ్రీసూర్య నవావరణ స్తోత్రం